- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి కొత్త పెన్షన్ పథకాలకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ పథకాల కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, 30-35 ఏళ్ల వివాహం కాని మహిళలు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, 50 ఏళ్లు పైబడిన చేనేత, గీత కార్మికులు అర్హులు. వితంతువులకు భర్త డెత్ సర్టిఫికెట్ లేదా ఏడాదిగా విడిగా ఉంటున్నట్లు తహశీల్దార్ నివేదిక, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్, చేనేత, గీత కార్మికులకు సంబంధిత సొసైటీ సభ్యత్వం, సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలి.
- Advertisement -



