- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు సహకరించడం లేదని, కీలక సమాచారం రాబట్టేందుకు అతన్ని మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టును కోరారు. శుక్రవారం కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన నిందితుడు, విచారణ సమయంలో పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, సీసీ కెమెరాలు లేని చోట విచారిస్తూ అధికారులు దురుసుగా ప్రవర్తించారని మేజిస్ట్రేట్కు తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోర్టు అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -



