- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో సన్న రకం బియ్యం ధరలు కిలోకు రూ.10-20 వరకు పెరిగాయి. టోకు మార్కెట్లో బస్తాపై రూ.300 నుంచి రూ.400 వరకు ప్రియమయ్యాయి. మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులు సిండికేట్గా మారి అక్రమంగా నిల్వలు పెంచడం, రవాణా ఖర్చులు పెరగడంతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. రేవుల్లో కంటైనర్లు పేరుకుపోయి బియ్యం మిల్లులు సంక్షోభంలో పడ్డాయి.
- Advertisement -



