- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు వేదికగా మార్చనుంది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు, 5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 3-4 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించే అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్లకు చట్టపరమైన రక్షణ, సనత్నగర్లో TIMS ప్రారంభం, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. సెప్టెంబర్లో ఇందిరమ్మ టవర్లకు శంకుస్థాపన జరగనుంది.
- Advertisement -



