నవతెలంగాణ – దర్పల్లి
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ పథకం అని చల్లగారగా గ్రామ సర్పంచ్ గాదె నరేష్ అన్నారు. శనివారము ఆయన గ్రామనికి చెందిన ఎలకంటి ప్రణీత్ గౌడ్, గుండారం వరుణ్ తేజ్, బంగ్లా రాణి లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక నాయకుల సాయంతో వీరి సమస్య రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అనారోగ్య బాదిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించారు. శనివారం సర్పంచ్ గాదె నరేష్ బాదితులకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ పార్టీకి, స్థానిక నాయకులకు, సర్పంచ్ కు మమ్ములను కష్టకాలంలో ఆదుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని వారు బాదిత కుటుంబం తెలిపింది. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ మగ్గిడి స్రవంతి,వార్డు సభ్యులు ,గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిరు పేదలకు వరం సీఎంఆర్ఎఫ్: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



