Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందిని ఇందులో భాగంగా మండలంలోని లక్ష్మీదేవుని పల్లి, ర్యాగట్లపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు.

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న 6 కుటుంబాలకు చెక్కులను నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. ప్రజల కష్టాలను గుర్తించి ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకే వచ్చి సాయం అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లింగాల రాజా బాబు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, గ్రామ గ్రామ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, భిక్నూర్ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -