నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ మండలంలోని మాజీ సర్పంచులను ముందస్తుగా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సర్పంచులకు రావలసిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచుల సంఘం ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు మేరకు పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తామని గతంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్ర చౌక్లో సర్పంచులకు న్యాయం చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల సమస్యలను పట్టించుకోకుండా, రెండున్నర సంవత్సరాలుగా బకాయిల చెల్లింపుల్లో కాలయాపన చేస్తున్నారని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పంచులు వేణు, శ్రీనివాస్, రమేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.



