- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లా డోయివాలా పరిధిలో దారుణం జరిగింది. పాలు తీసుకొని ఇంటికి వెళ్తున్న అంజలి గుప్తా (39) అనే మహిళపై థానో అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
- Advertisement -



