- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు రాబోయే 3 గంటలు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- Advertisement -



