- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుకు తరలించారు. ఇస్లామాబాద్లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను రావల్పిండిలోని అడియాలా జైలుకు తీసుకెళ్లినట్లు పీటీఐ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తొలుత ఆయనను అక్కడికి తరలించారు. అనంతరం తిరిగి జైలుకు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
- Advertisement -



