- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సోమాలియా తీరంలో హైజాక్ అయిన, తుర్కియే ఆయుధాలను తరలిస్తున్న కార్గో నౌకలోని 10 మంది సిబ్బందిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఈ నౌక మొగడిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తోంది. సోమాలియాలో సముద్రపు దొంగల బారిన పడిన కామెరూన్ పతాకంతో వెళ్తున్న కార్గో నౌకలో ఆరుగురు భారతీయులు ఉన్నారని ఓ సోమాలి అధికారి తెలిపారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇంకా స్పందించలేదు.
- Advertisement -



