- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి కల్వర్టును ఢీకొని ఓ కంటైనర్ బోల్తా పడింది. ట్రాఫిక్ చర్యలలో భాగంగా ఆదివారం భారీ క్రేన్ సాయంతో కంటైనర్ ను బయటకు తీసేందుకు హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో మూడు కిలోమీటర్ల మీర ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ట్రాఫిక్ లో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కాన్వాయ్ కూడా చిక్కుకుంది.
- Advertisement -



