- Advertisement -
నవతెలంగాణ -తాడ్వాయి : నూతన ములుగు మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్ ను సోమవారం సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు దుబాసి సుధాకర్ లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. జిల్లా లో కొత్త గా ఏర్పడిన మొదటి మున్సిపాలిటీ కి మెరుగైన సేవలు అందించి, మంచి పేరు తేవాలి అని కోరారు. ములుగు ఏజెన్సీలో మంచి సేవ చేస్తే సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆశీర్వాదాలు తప్పక ఉంటాయని చెప్పారు.
- Advertisement -