- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొత్తగా 1,500 మంది కండక్టర్లను నియమించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో తొలగించిన 244 మంది ఉద్యోగులను విచారణ అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు, 1,424 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సంస్థలో 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేయగా, ప్రస్తుతం 1,024 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని మంత్రి వివరించారు.
- Advertisement -



