- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించారు. ఇప్పటికే పదవీకాలం అయిపోయిన కార్పొరేషన్ ఛైర్మన్ల రెన్యూవల్ అంశాలు చర్చకు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జిల్లాల వారీగా జరుగుతున్న సమావేశాల గురించి కూడా చర్చించారు. వీటితో పాటు ఇటీవల పార్టీ మారిన జీవన్రెడ్డి అంశంపై కూడా ఇరువులు నేతలు చర్చించినట్లు సమాచారం. కాగా ఇవాళ డీలిమిటేషన్ అంశంపై చర్చకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు.
- Advertisement -



