- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందారు. ఈ మేరకు బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చెరుకూరు గ్రామానికి చెందిన సందెపూడి సాల్మన్ రాజు (35) ఐదేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం వియత్నాం వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాల్మన్ భౌతికకాయాన్ని శనివారం స్వస్థలానికి తరలించనున్నట్టు సమాచారం.
- Advertisement -



