చైర్మన్ వెంకటయ్య
నవతెలంగాణ – మిడ్జిల్
చిరుధాన్యాలు పంటల ద్వారా అధిక లాభాలతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, దుందిబి ఫార్మా కంపెనీ చైర్మన్ వెంకటయ్య తెలిపారు. గురువారం మండలంలోని కొత్తూరు గ్రామంలో చిరుధానాలపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు సర్పంచ్ రాములు ముఖ్యఅతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. ఐ సి ఏఆర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నీ రాజేంద్రనగర్ లో చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై రైతులకు శిక్షణ నిర్వహించినట్లు చెప్పారు.
లబ్ధిదారులు: దుందుభి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ రైతుల కోసం ఉచితంగా విత్తనాలను పంపిణీ చేసిందని చెప్పారు. మహిళా సంఘ సభ్యులు తయారుచేసిన చిరుధాన్యాలు, లడ్డూలు, తిను బండారులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పి. దశరథం, సీఈవో
నరేష్, ఉపసర్పంచ్ చీపిరి అర్జున్, మహిళలు పి.కవిత, పి.రంగమ్మ, పి.నాగమ్మ పి.మీనా, పి.శ్రీలత, కే.బీమమ్మ, ఏ.పద్మమ్మ, శ్రావణి, బాల్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.



