- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. నగరంలో త్వరలో 60 కొత్త ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-బస్ సేవా పథకం కింద హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. ఈ బస్సుల కొనుగోలుకు ప్రైవేట్ సంస్థకు టీజీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది.
- Advertisement -



