- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ‘స్పెషల్ టెట్’-2026 పరీక్షలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. మొత్తం 24,986 మంది టీచర్లు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పేపర్-1 కు 5,964 మంది, పేపర్-2 కు 19,022 మంది దరఖాస్తు చేసుకోగా, 13 జిల్లాల్లోని 41 ఆన్లైన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2028 ఆగస్టు 31 లోపు ఇన్-సర్వీస్ టీచర్లందరూ టెట్ అర్హత సాధించాల్సి ఉన్నందున విద్యాశాఖ ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.
- Advertisement -



