- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. బకాయిలు అందక సిబ్బంది జీతాలు, కాలేజీల నిర్వహణ భారంగా మారి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యాజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 9న మానవహారాలు, అనంతరం నిరవధిక సమ్మెకు దిగుతామని టీపీడీఎంఎ హెచ్చరించింది.
- Advertisement -



