దక్షిణ భారతానికి గర్వకారణం
నవతెలంగాణ – హైదరాబాద్
2026-29 మూడేండ్ల కాలానికి ఐఎన్టీఏసీహెచ్ గవర్నింగ్ కౌన్సిల్కు ఎన్నికైన ఇంజనీర్ వేదకుమార్ మణికొండ శుక్రవారం న్యూ ఢిల్లీలోని ఐఎన్టీఏసీహెచ్ ప్రధాన కార్యాలయంలో ఐఎన్టీఏసీహెచ్ జాతీయ కార్యవర్గానికి కూడా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐఎన్టీఏసీహెచ్ చైర్మెన్ అశోక్ సింగ్ ఠాకూర్, సభ్య కార్యదర్శి రవీంద్ర సింగ్ (రిటైర్డ్ ఐఏఎస్) సమక్షంలో ప్రకటించారు. ఈ గౌరవం ఆయన నాయకత్వం, అనుభవం, వారసత్వ పరిరక్షణపై ఉన్న అంకితభావానికి గుర్తింపుగా నిలుస్తోందని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మెన్ కె. ప్రభాకర్ తెలిపారు. ఈ పదవికి మణికొండ ఆయన ఎన్నిక కావడం ద్వారా సంస్థ పనుల్లో ఆయన మరింత సమర్థంగా సేవలందిస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది. దక్షిణ భారతదేశం నుం,ఇ ఐఎన్టీఏసీహెచ్ జాతీయ కార్యవర్గానికి ఎన్నికైన కొద్దిమందిలో ఇంజినీర్ వేదకుమార్ మణికొండ ఒకరు.
ఐఎన్టీఏసీహెచ్ జాతీయ కార్యవర్గానికి ఇంజినీర్ వేదకుమార్ మణికొండ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



