- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డు పొడిగించింది. మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ మరియు ఫెయిల్ అయిన (జనరల్, వొకేషనల్) విద్యార్థులు ఏప్రిల్ 23, 2026 వరకు ఫీజు చెల్లించవచ్చని టీజీబీఐఈ కార్యదర్శి సోమవారం నాంపల్లిలోని కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
- Advertisement -



