- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక పారిశ్రామిక వాడలోని ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో బాయిలర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు పరిశ్రమలో ఎలాంటి పరికరాలు లేవని స్థానికులు తెలిపారు. ఇదే పరిశ్రమకు ఆనుకొని మరో భారీ పరిశ్రమ ఉండటంతో అక్కడి నుంచి సేఫ్టీ విభాగం రసాయనాలు వెదజల్లారు.
- Advertisement -



