- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన అక్కనపల్లి శివరాం (,58) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. సోమవారం తన వ్యవసాయ పొలంలో ఎర్రజొన్న సొప్పను తగలబెట్టాడు. అయితే ప్రమాదశాత్తూ ఆ మంటలు కాస్తా.. బోరుకు, పానెల్ బోర్డుకి వ్యాపించాయని తెలిపారు. మృతుడు పానెల్ బోర్డు నుండి కరెంటు వైర్లు తీయబోయి ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
- Advertisement -



