Tuesday, April 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఢిల్లీలో బీఆర్‌ఎస్‌ త్రిసభ్య కమిటీ

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ త్రిసభ్య కమిటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌తో కూడిన బీఆర్‌ఎస్‌ త్రిసభ్య కమిటీ సోమవారం ఢిల్లీ వెళ్లింది. బుధవారం కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టులో తుది తీర్పు వెలువడనుంది. ఆ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. దీంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన అంశాలపై సీనియర్‌ అడ్వకేట్లతో చర్చించాలని భావించింది. అందుకోసమే త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ వెళ్లినట్టు తెలంగాణ భవన్‌ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -