నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ తక్షణమే విధులకు హాజరుకావాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులు కోరుతున్న డిమాండ్లను ఒకేసారి కాకుండా, ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్మికుల ప్రధాన డిమాండ్లను లోతుగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించాం. ఈ కమిటీ ఇచ్చే సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయి. కొన్ని కార్మిక సంఘాలు స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అనవసర ఆందోళనలతో సంస్థకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. సంస్థ ప్రయోజనాలను దృష్ట్యా, ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. అంతా విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం. కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



