నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సులు డిపోకే పరిమితమైయ్యాయి. దీంతో ముఖ్యంగా హైదరాబాద్లో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజూ బస్సుల్లోనే 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో దాదాపు వారంతా మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత మందితో అన్ని స్టేషన్లు నిండిపోయాయి. మెట్రో రైల్ మూడు కారిడార్ల పరిధిలోనూ ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు ఆటోలకు సైతం డిమాండ్ పెరిగింది. బస్టాండ్లలో ఎంత సేపు ఎదురు చూసినప్పటికీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆటోల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
ఆర్టీసీ సమ్మె..మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



