- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
దండేపల్లిలోని గుడిరేవు అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ్ పక్వాడ నిర్వహించారు. సర్పంచ్ కళావతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందించే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు గర్భిణీలు, పాల్గొన్నారు.
- Advertisement -



