నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ శివారులోని జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న మహాగణపతిని టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గణనాథుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా విజయబాబు ఆకాంక్షించారు.
విఘ్నాలన్నింటినీ తొలగించే వినాయకుడు అందరికీ సకల శుభాలను ప్రసాదించాలని ఆయన కోరారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తోట సుజలరాణి, మట్టా ప్రసాద్, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు),
కాంగ్రెస్ నాయకులు తోట గణేష్, పొంగులేటి, మువ్వా అభిమానులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.



