- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
పోషణ మసోత్సవాల్లో భాగంగా మండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ అంగన్ వాడి కేంద్రం ఆధ్వర్యంలో పోషణ మాసం,చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిన్నారులకు విద్య యొక్క ప్రాముఖ్యతతో పాటు పోషకాహారం,ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించి,చిన్నారులకు అక్షరాభ్యాస్యం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి,ఉపసర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్,కార్యదర్శి అపర్ణ,అంగన్ వాడి టీచర్,ఆయా,ఆశాలు, స్వశక్తి మహిళలు,గర్భినిలు,బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -



