- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా సెమీఫైనల్లో భారత మహిళల జట్టు బంగ్లాతో తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ దూకుడుగా ఆడింది. ఓపెనర్ షెఫాలీ వర్మ శతకంతో అదరగొట్టింది. 49 బంతుల్లో 9 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో వంద పరుగులు చేసింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ 40, స్మృతి మంధాన 37 పరుగులతో రాణించారు.
- Advertisement -



