
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకొని,లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు కందుకూరు చంద్రమ్మ నర్సయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు లయన్స్ క్లబ్ కార్యదర్శి కందుకూరి లక్ష్మయ్య మంగ ఆధ్వర్యంలో ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరు లక్ష్మయ్య, కోశాధికారి గాదరబోయిన సురేష్ , మాజీ అధ్యక్షుడు రామచంద్రయ్య గౌడ్ , సోమేశ్ , పోతరాజు ముత్తయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి , ఉపాద్యాయులు మురళి , మల్లికార్జున్ , జానిబేగం , అనితాకుమారి తదితరులు పాల్గొన్నారు.