చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల వినతి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ నల్ల చెరువు కట్ట అలుగు వద్ద పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి అలుగు నీరు బయటకు వెళ్లకుండా అడ్డుగా ఉన్నాయని, వర్షాలు అధికంగా కురిస్తే చెరువు నుండి కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి చెరువు కట్టకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి నరేందర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామ మత్స్యకారుల విన్నపాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని, అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ప్రమాదం జరగకుండా చూడాలన్నారు. అలుగు వద్ద పెద్ద ఎత్తున పొదలు, పిచ్చి మొక్కలు భారీ చెట్లు పెరగడం వల్ల అలుగు నీరు బయటకు వెళ్లడం లేదన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో చెరువు నిండినప్పుడు అలుగు నీరు బయటకు వెళ్లలేక చెరువు కట్టకు బుంగలు పడుతున్నాయని తెలిపారు. అతి భారీ వర్షాలు కురిస్తే గతంలో చెరువు కట్టకు బుంగలు పడ్డ ప్రదేశాల్లో చెరువు కట్ట తెగేందుకు ఆస్కారం ఉందన్నారు. అధికారులు తక్షణం స్పందించి అలుగు వద్ద పిచ్చి మొక్కలు, పొదలు, చెట్లను తొలగింపజేసి అలుగు నీరు బయటకు వెళ్లేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
అధిక వర్షాలకు కట్ట తెగే ప్రమాదం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES