Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు జరిగే సమావేశానికి అధికారులందరూ హాజరు కావాలి 

రేపు జరిగే సమావేశానికి అధికారులందరూ హాజరు కావాలి 

- Advertisement -

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 
నవతెలంగాణ-భూపాలపల్లి : వరదల సన్నద్ధతపై రేపు సాయంత్రం 3 గంటలకు ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించనున్న  సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలతో సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వర్షాకాలంలో రానున్న వరదలపై ముందస్తు రక్షణ చర్యలు తీసుకునే చర్యలు,వరదల పట్ల సకాలంలో స్పందించే విధంగా సంబంధిత శాఖల మధ్య సమన్వయం కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. కావున జిల్లాలోని అన్ని లైన్ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -