Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పర్యావరణం కోసం మొక్కలు నాటాలి.!

పర్యావరణం కోసం మొక్కలు నాటాలి.!

- Advertisement -

ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి..
నవతెలంగాణ – మల్హర్ రావు
: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తాడిచెర్లలో బొగ్గుతవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తాడిచర్ల ఓసీపీలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మొక్కలు ప్రకృతి సమతుల్యతను కాపాడతాయన్నారు. నాటిన మొక్కలను తప్పక సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్ భూతం నుంచి భూమిని పరిరక్షించాలని ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ రామ్ కుమార్, హెచ్ ఆర్ డి జి ఎం రమేష్ బాబు, రాయ భాస్కర్, అభిషేక్, అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img