Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ సమస్య ఉన్నోళ్లు అధైర్య పడవద్దు..

భూ సమస్య ఉన్నోళ్లు అధైర్య పడవద్దు..

- Advertisement -

భూ భారతి కార్యక్రమాన్ని సందర్శించిన కలెక్టర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: భూ సమస్య కలిగిన ఎవ్వరు అధైర్య పడవద్దని, నూతన అర్ ఓ అర్ చట్టం లో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్య కలిగిన ప్రతి ఒక్కరూ మీ గ్రామంలో సదస్సు నిర్వహించే రోజున అర్జీ పెట్టుకోవాలని తెలిపారు. సదస్సులో రెవెన్యూ అధికారులకు మీ సమస్య ఏదైనా సరే క్లుప్తంగా వివరిస్తే సమస్య ఎలా, ఎప్పుడూ, ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో అనే విషయాలను భూ భారతి చట్టం లో పొందుపర్చిన అంశాలు అన్నీ తెలియజేసి సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో ఈ నెల 20 వరకు నిర్వహిస్తున్న సదస్సుల్లో భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలిపారు. భూ స్వాములతో మాట్లాడుతూ వారి సమస్య విని చట్టం ప్రకారం అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో రామ్మూర్తి, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -