జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి లో అజీమ్ పాషా (17) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు జమ్మికుంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అజీమ్ పాషా మృతదేహాన్ని పరిశీలించి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని, దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కొత్తపల్లి తమ ఇంట్లో నుండి రాత్రి బయటకు వెళ్ళాడు. తెల్లవారేసరికి చెట్టుకు ఉరి వేసుకొని ఉన్నాడని తెలిపారు. మృతుని తండ్రి రాజ్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.