Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొతంగల్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసు కమిషనర్

పొతంగల్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసు కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్ట్ లను కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సమయంలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ గల రికార్డు లను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అక్రమంగా పశువుల ను తరలించడం జరగకూడదని , ప్రతీ వాహనానికి గల కాగితాలు తనిఖీ నిర్వహించాలని తెలియజేశారు అనంతరం వాహనాలను తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా బోధన్ ఎ.సి.పి  శ్రీనివాస్, రుద్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్  కృష్ణ, కోటగిరి పిఎస్ ఎస్ఐ  సునీల్ చెక్ పోస్ట్ సిబ్బంది గలరు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -