మాస్కో: అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్లు బుధ వారం ఫోన్కాల్లో మాట్లాడుకున్నా రని క్రెమ్లిన్ సహాయకుడు తెలిపారు. ఉక్రెయిన్ అంశంపై చర్చించిన ఇరు వురు నేతలు ఇటీవల భారత్, పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి కూడా మాట్లాడుకున్నట్లు క్రెమ్లిన్ సహా యకుడు, విదేశాంగ విధానాలపై పుతిన్ సలహాదారు కూడా అయిన యూరి ఉష్కొవ్ మీడియాకు తెలి పారు. పశ్చిమాసియాలో చోటుచేసు కుంటున్న పరిణామాలపై కూడా వారు సవివరంగా చర్చించారని రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. అయితే ఉష్కొవ్ ఆ వివరాలను వెల్లడించ లేదు. రష్యన్ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులపై పుతిన్తో చర్చించినట్లు ట్రంప్ ట్రూత్ సోషల్లో బుధవారం పోస్టు పెట్టారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సంభాషణ బాగా జరిగిందని ట్రంప్ వ్యాఖ్యానిం చారు. ఇరుపక్షాల మధ్య ఇటీవల జరిగిన ఇతర దాడులపై కూడా ప్రస్తావన వచ్చిందన్నారు. ఇటీ వల తమ వైమా నిక స్థావరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడులకు కచ్చితం గా తగురీతిలో స్పం దిస్తామని పుతిన్ స్పష్టం చేసినట్టు ట్రంప్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష చర్చలను దెబ్బతీయడానికి కీవ్ ప్రయత్నించిం దని పుతిన్, ట్రంప్కు తెలియ చేశారని ఉష్కొవ్ తెలిపారు. ఆ చర్చలకు ముందురోజే రష్యా స్థావ రాలపై దాడి జరిగింది. బ్రియాన్స్క్, కుర్క్స్ ప్రాంతాల్లో రైల్వే వంతెనల కూల్చివేత కూడా కీవ్ పాల్పడిన తీవ్ర వాద చర్యే అని పుతిన్ స్పష్టం చేశారు.
పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES