Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడిబాటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎంపీడీఓ

బడిబాటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ భాగస్వాములు కావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అలివేలు మంగమ్మ అన్నారు. దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి అధికారులకు నిర్వహించబడిన సమన్వయ సమావేశంలో అమె మాట్లాడారు. ప్రభుత్వం జూన్ 6 నుండి 19 వరకు ఆరు సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు బాల బాలికలందరూ పాఠశాలల్లో నమోదు గావించబడే విధంగా విద్యాశాఖ వారు కార్యాచరణ రూపొందించారని చెప్పారు. గ్రామ కార్యదర్శులు , ఉపాధి హామీ సిబ్బంది , గ్రామస్థాయిలో ఉపాధ్యాయులతో సమన్వయం ఏర్పరచుకొని గ్రామ పెద్దల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో బడి ఈడు పిల్లలందరినీ చేర్పించాలని కోరారు. ప్రభుత్వం ద్వారా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల ఆధునికీకరణ, ఉన్నత పాఠశాలలో డిజిటల్ విద్య తదితర సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. ఉచిత పాఠ్యపుస్తకాలు , ఉచిత నోట్ బుక్కులు, రెండు జతల యూనిఫార్మ్స్ విద్యార్థులకు అందించుటకు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా తల్లిదండ్రులకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -