– నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ షురూ
– శాట్జ్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ స్కూల్స్లో ప్రవేశాలకు మూడంచెల విధానం అమలు చేస్తున్నట్టు శాట్జ్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి నాల్గో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అడ్మిషన్ల పోస్టర్ను శాట్జ్ ఎండీ సోనిబాలా దేవితో కలిసి శివసేనా రెడ్డి ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన అభ్యర్థులను హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్లో 120 సీట్లకు ఎంపిక చేయనున్నారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు నేటి నుంచి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జూన్ 16 నుంచి మండల స్థాయి, 23 నుంచి జిల్లా స్థాయి, జులై 1 నుంచి రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. 2016 సెప్టెంబర్ 1 – 2017 ఆగస్టు 30 మధ్య జన్మించి 8 నుంచి 9 ఏండ్ల వయసు కలిగిన బాల, బాలికలు ప్రవేశ పోటీలో పేర్లు నమోదు చేసుకునేందుకు అర్హులు.
స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు మూడంచెల ఎంపిక విధానం
- Advertisement -
- Advertisement -