- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వినికిడిలోపంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఉచితంగా సర్జరీ చేయించాలని ఆదేశించారు. నాలుగేళ్ల లిఖితా శ్రీ అనే చిన్నారి వినికిడి సమస్యతో బాధపడుతోంది. దీంతో వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని చెప్పారు. కానీ తల్లి దండ్రుల వద్ద అంత స్తోమత లేకపోవడంతో ఆందోళన చెందారు. పాప విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెల్లడంతో ఆయన వెంటనే ఉచితంగా పాపకు సర్జరీ చేయించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు పాపకు ఫ్రీగా సర్జరీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లిఖితా శ్రీ కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -