నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ ప్రవితమై బక్రీద్ మాసాన్ని పురస్కరించుకోని దేశవ్యాప్తంగా ఉన్న మసీదులకు ముస్లిలు సోదరులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే పవిత్ర ప్రార్థనలు చేయడానికి మసీదుల ముందు బారులు తీరారు. దేశరాజధాని ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లీం సోదరులతో కిక్కిరిసిపోయింది. పవిత్ర ప్రార్థనలకు కోసం కుటుంబసభ్యులతో కలిసి మైనార్టీలు మసీదులకు కదలివచ్చారు. దీంతో ఆ మసీదు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలుపుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముస్లీం క్యాలెండర్ ప్రకారం..త్యాగానిక ప్రతీకగా జరుపుకునే అతి పవిత్రమైన పండుగ బక్రీద్.

మరోవైపు రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా కల్పించారు. ట్రాఫిక్ జాం కాకుండా..మసీదుకు వచ్చే మార్గాల్లో పలు ఆంక్షలు విధించారు. వాహనాదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. సీసీ కెమారాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. మసీదుకు వచ్చే ప్రతి వాహనాన్నీ కుణ్ణంగా పరిశీలించారు.
