- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్ : నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాకేష్ గౌడ్ ఈనెల 5వ తేదీన ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరు కాలేదు. అదేరోజు మద్యం సేవించి ప్రయాణించడంతో తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో అతను నడుపుతున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రమాదానికి గల కారణాలను వెతికే క్రమంలో అతిగా మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని నిర్ధారణ అయ్యింది. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన సదరు కానిస్టేబుల్ పై కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -