అల్లాహ్ దయతో మన ముస్లిం సోదరులు సుభిక్షంగా ఉండాలి..
నవతెలంగాణ – ఆత్మకూరు : తోటి సోదర, సోదరీమణులకు తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి భాయ్ ఈద్ ఉల్ అధా (బక్రీద్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు”. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదర భావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుంది” అని అన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. అల్లాహ్ దయతో ముస్లిం సోదరులు సుబిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని వలి భాయ్ వెల్లడించారు.
త్యాగానికి ప్రతీక బక్రీద్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES