– వైద్య పరీక్షల కోసం సిమ్లా ఆస్పత్రికి
సిమ్లా: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శనివారం స్వల్పంగా అస్వస్థ తకు గురయ్యారు. వ్యక్తిగత పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన ఆమెను సిమ్లా లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆస్పత్రికి తరలించారు. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షించింది. చిన్న ఆరోగ్య సమస్యల కారణంగా వైద్య పరీక్షల కోసం ఐజీఎంసీకి ఆమె వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వైద్య పరీక్షల తర్వాత ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్లినట్టు వెల్లడించారు. కాగా, ఐజీఎంసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి ధని రామ్ శాండిల్, ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా ఆస్పత్రికి చేరుకున్నారు. రెండు రోజులు ఉనా పర్యటనలో ఉన్న హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కూడా తన పర్యటన ముగించుకుని సిమ్లాకు తిరిగి వచ్చారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని ఛరాబ్రాలో ప్రియాంక గాంధీ వాద్రాకు వ్యక్తిగత నివాసం ఉన్నది. దీంతో సోనియా గాంధీ విశ్రాంతి కోసం ఇక్కడకు వచ్చినట్టు సమాచారం. ఆదివారం తిరిగి ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షల కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆస్పత్రికి ఆమె వెళ్లినట్టు తెలుస్తున్నది.
సోనియాకు స్వల్ప అస్వస్థత
- Advertisement -
- Advertisement -