- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా మాన్సూన్ చెక్ అప్ క్యాంప్ను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. 500 నగరాల్లోని 1,090కి పైగా అధీకృత వర్క్షాప్ ల మద్దతుతో దీన్ని జూన్ 6 నుంచి జూన్ 20 వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.
ఇందులో వినియోగదారులు ఉచిత సమగ్ర వాహన తనిఖీని పొందవచ్చని తెలిపింది. కార్ టాప్ వాష్, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, ఇంజిన్ ఆయిల్, యాక్సెసరీస్, ఎక్స్టెండెడ్ వారంటీ, లేబర్ ఛార్జీలపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్టు వెల్లడించింది.
- Advertisement -