- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బీ ఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని, ఆయన యువజన నేతగా, సినీ నిర్మాతగా సాధించిన విజయాలను గుర్తు చేసుకున్న జీవన్ రెడ్డి మాగంటి గోపినాథ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
- Advertisement -