Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంగాజాలో యుద్ధాన్ని వెంటనే ముగించాలి.. రోమ్‌ వీధుల్లో భారీ ర్యాలీ

గాజాలో యుద్ధాన్ని వెంటనే ముగించాలి.. రోమ్‌ వీధుల్లో భారీ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ – రోమ్‌ :   గాజాలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సుమారు 30,000మంది ప్రదర్శనకారులు రోమ్‌ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ఇటలీ ప్రధాన ప్రతిపక్షమైన వామపక్షంతో పాటు పలు పార్టీల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన నిరసనకారులు ర్యాలీలో పాల్గన్నారు. వీరిలో చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. మితవాద ప్రభుత్వం మౌనంగా ఉందని, గాజాలో మారణకాండపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పాలస్తీనా, ప్రతిపక్ష పార్టీల జెండాలను చేతబూని ”ఊచకోతను ఆపండి, కుట్రను ఆపండి” అనే ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. పాలస్తీనియన్ల ఊచకోతకు, ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ నేరాలను ఎండగట్టేందుకు ఇది ఒక అపారమైన ప్రజా ప్రతిస్పందన అని ఇటలీ సెంటర్‌ లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత ఎల్లీప్లీన్‌ పేర్కొన్నారు. మెలోనీ ప్రభుత్వ విధానం మాదిరిగా కాకుండా మౌనంగా ఉండని మరొక ఇటలీ ఉందని ఇటలీ ప్రధాని జార్జి మెలోనీని ఎండగడుతూ ఆమె పేర్కొన్నారు. అసాధారణమైన ఊచకోత జరిగినప్పటికీ, క్రూరమైన, అనుచితమైన ప్రతిచర్య జరిగినప్పటికీ ఇటాలియన్‌ ప్రభుత్వం స్పందించడం లేదని ట్యునీషియా ప్రదర్శనకారుడు ఒకరు అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img