Monday, June 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజాపూర్‌ పోలీస్‌ కస్టడీలోని మావోయిస్టులను కోర్టులో హాజరుపర్చాలి

బీజాపూర్‌ పోలీస్‌ కస్టడీలోని మావోయిస్టులను కోర్టులో హాజరుపర్చాలి

- Advertisement -

మావోయిస్టుల మరణాలపై సుప్రీం న్యాయమూర్తితో విచారణ చేపట్టాలి : వామపక్ష పార్టీల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కొనసాగుతున్న మావోయిస్టు అగ్రనాయకుల హత్యలు అత్యంత అమానుషంగా కొనసాగుతున్నా యని వామపక్ష పార్టీలు విమర్శించాయి. బీజాపూర్‌ పోలీస్‌ కస్టడీలోని నాయకుల్ని ఒక్కొక్కర్ని కాల్చిచంపి, ఎన్‌కౌంటర్లుగా పోలీసులు ప్రకటిస్తున్నారని తెలిపాయి. ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో వామపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. పశ్య పద్మ (సీపీఐ) అధ్యక్షత వహించగా, సీపీఐ(ఎం) నుంచి ఎండీ అబ్బాస్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ నుంచి వేములపల్లి వెంకట్రామయ్య, కె గోవర్ధన్‌, ఎంసీపీఐ(యూ) నుంచి వనం సుధాకర్‌, ఎస్‌యూసీఐ(సీ) నుంచి తేజ, ఆరెస్పీ నుంచి జానకి రాములు పాల్గొన్నారు. 2004 నాటి శాంతి చర్చల ప్రతినిధి సుధాకర్‌తోపాటు, సురేష్‌ తదితర ఐదుగురి మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నదని తెలిపారు. అంతేగాకుండా పది, 20 మంది నాయకులు ఇంకా పోలీసుల కస్టడీలో ఉన్నట్టు, వారందరినీ కూడా ఇదే రీతిలో కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌ మరణాలుగా ప్రకటించే అవకాశం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో బీజాపూర్‌ పోలీస్‌ కస్టడీలో ఉన్న మావోయిస్టులందర్నీ వెంటనే కోర్టులో హాజరు పర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుధాకర్‌, సురేష్‌ తదితరుల హత్యలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణం నిలిపేసి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలను ప్రారంభించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -