కళాకారుల పారితోషికాల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతా
సమాజాభివృద్ధికి కవులు, రచయితలు, కళాకారుల కృషి అవసరం : మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ – బంజారాహిల్స్
సమాజ చైతన్యానికి కవులు, కళాకారులు, నాటక కళాకారులు తమ ప్రతిభను వినియోగించుకోవాలని పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. అవసరమైతే వీటికోసం రూ. 10 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీనిచ్చారు. నర్సింగరావు సమర్పించిన సాంస్కృతిక విధాన పత్రాన్ని అమలు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన కళాకారులకు సాంస్కృతిక కళాసారధిలో ఉద్యోగావకాశాలు, పారితోషికాల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. సమాజం సర్వదిశల అభివృద్ధికి కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో ‘ప్రభుత్వ పథకాలు-సమాజాభివృద్ధి-సాంస్కృతిక అంశాలు’ అంశంపై జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. సంస్కృతి అనేది కేవలం కళలు, కవిత్వం, భాషలకే పరిమితం కాదని, అది మన జీవనశైలి, మన అస్తిత్వం అన్నారు. అందుకే, సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహితీవేత్తలదేనని తెలిపారు. సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, యువతలో పెరిగిన పెడ ధోరణులు వంటి సమస్యలను పరిష్కరించాలంటే మూలాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని, ఈ బాధ్యత కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు తీసుకోవాలన్నారు. సమాజంలో ఆలోచనా ధోరణిలో మార్పు తేవాలని, కలానికి పదును పెట్టాలని పిలుపునిచ్చారు.
కళాకారుల విన్నపాలు..
ఈ సదస్సులో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. నాటకం, సంగీతం, నృత్యం వంటి కళా రంగాలను విద్యా కరికులంలో చేర్చాలని, జానపద కళారూపాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. థియేటర్లలో పాతకాలపు న్యూస్ రీల్స్ మాదిరి సామాజిక అవగాహన కలిగించే వీడియోల ప్రదర్శన చేపట్టాలని సూచించారు. వృద్ధ కళాకారులకు పింఛన్, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. యువతను చెడు వ్యసనాల బారి నుంచి కాపాడేందుకు ప్రముఖుల ద్వారా సందేశాలు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కళా సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాల, జయేష్ రంజన్, మామిడి హరికష్ణ, ప్రజా కవులు సుద్దాల అశోక్ తేజ, అందెశ్రీ, కళాకారులు చౌదరపల్లి రవి కుమార్, దరువు అంజన్న, మిట్టపల్లి సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
నర్సింగరావు విధాన పత్రం అమలు దిశగా చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES